మలేషియా మాజీ ప్రధానికి ప్రధానికి 12 ఏళ్ళ జైలు శిక్ష
- July 28, 2020
మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ కు అవినీతి కేసులో కౌలాలంపూర్ లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. లక్షలాది డాలర్ల స్కామ్ లో ఆయనను దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి చిట్టా బయటపడడంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగానికి, మనీ లాండరింగ్ఫ్ కి, విశ్వాసోల్లంఘనకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. తమ దేశంలో ఎన్ ఆర్ సి ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. తన ప్రధాని హోదాను అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో దేశ ఖజానానుంచి సొమ్మును అక్రమంగా సంపాదించాడట.. ఈ ఆరోపణలను పురస్కరించుకుని మహమ్మద్ నజ్లాన్ గజాలీ అనే న్యాయమూర్తి ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు..మొతం 12 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
మలేషియా లో అవినీతిపరులు, ఇతర నేరస్థులకు జైలుశిక్షలతో బాటు కొరడా దెబ్బల శిక్షలు కూడా విధిస్తారు. అయితే నజీబ్ 67 ఏళ్ళ వయస్సు వాడైనందున ఆయనను ఈ శిక్షల నుంచి మినహాయించారు.కాగా-తమ నేతకు ఇన్నేళ్ల జైలు శిక్షఅని ప్రకటించగానే కోర్టు బయట ఉన్న నజీబ్ వందలాది అభిమానులు విలపించారు. ఇది రాజకీయ కక్ష అని ఆరోపించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







