కోవిడ్ 19: బహ్రెయిన్ లో సున్నాకు చేరిన కోవిడ్ మృతుల సంఖ్య
- August 02, 2020
మనామా:బహ్రెయిన్ లో కోవిడ్ డెత్ రేట్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం కోవిడ్ మృతుల సంఖ్య సున్నాకు చేరింది. అంతేకాదు..కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 371కి పెరిగింది. దీంతో బహ్రెయిన్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 38,211కి చేరినట్లు బహ్రెయిన్ ఆరోగ్య శాఖ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా 2,832 యాక్టీవ్ కేసులు ఉండగా అందులో 2,789 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. యాక్టీవ్ కేసులలో 81 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 43 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు శనివారం దేశవ్యాప్తంగా 4,569 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు కింగ్ డమ్ లో మొత్తం 8,35,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. లేటెస్ట్ గా నిర్వహించిన టెస్టులో 208 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







