'టెస్లా' వాహనాల రూపకర్త వ్యాఖ్యలపై స్పందించిన ఈజిప్ట్ ప్రభుత్వం
- August 03, 2020
వాషింగ్టన్: విద్యుత్ వాహనాల తయారీకి ఎలాన్ మస్క్ ఎంత ప్రసిద్ధో.. విచిత్ర వ్యాఖ్యలకు కూడా ఆయన అంతగా ప్రాచుర్యం పొందారు. సోషల్ మీడియా వేదికల్లో తరచూ వింత వింత వ్యాఖ్యలు చేస్తూ కల్లోలం సృష్టిస్తుంటారు. తాజాగా..పిరమిడ్లను గ్రహాంతర వాసులు నిర్మించినట్టున్నారు..స్పష్టంగా తెలుస్తోంది..అంటూ ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అయన నిజంగానే ఇలా అన్నారా లేక జోక్ చేస్తున్నారా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. దాదాపు 5.4 లక్షల లైకులతో, 86 వేల రీట్వీట్లతో సోషల్ మీడియాను దున్నేసింది. మరి సహజంగానే ఈ ట్వీట్ ఈజిప్టు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఏకంగా ఆదేశ అంతర్జాతీయ వ్యవహారాల మంత్రి స్పందించారు. 'మస్క్.. మీ వర్క్ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాను. అయితే మీరు ఓ సారి ఈజిప్టుకు రండి. పిరమిడ్లపై ఉన్న రాతలను పరిశీలించండి. పరమిడ్లను నిర్మించిన వారి సమాధుల్ని చూడండి. మీ కోసం వెయిట్ చేస్తున్నాం' అని ఆమె ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!







