వాట్సాప్ కొత్త ఫీచర్..ఫేక్న్యూస్ వ్యాప్తికి చెక్
- August 04, 2020
న్యూఢిల్లీ: కరోనా విజృంభనతో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు కొద్ది రోజుల కింద వాట్సాప్ కొత్త విధానానికి తెర తీసింది. దీని ప్రకారం ఏదైనా సందేశాన్ని ఒకసారి కేవలం ఐదుగురికి మాత్రమే షేర్ చేయగలం. అయితే దీనితో ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించకపోయినప్పటికీ.. ఫేక్న్యూస్ స్వల్ప స్థాయిలో తగ్గిందని వాట్సాప్ చెప్పుకొచ్చింది.
కాగా ఇప్పుడు మరొక కొత్త ఫీచర్తో ఫేక్న్యూస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వాట్సాప్ సిద్ధమైంది. యూజర్ల చేతనే సదరు సమాచారాన్ని నిజమా, అబద్దమా కనిపెట్టించి ఎక్కువ మందికి షేర్ కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సందేశం పక్కన బ్రౌజర్ ఫీచర్ను కొత్తగా యాడ్ చేశారు. ఆ బ్రౌజర్ ఫీచర్ ద్వారా సదరు సందేశానికి సంబంధించిన వివరాలను గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఎలా పని చేస్తుందంటే..?
వాట్సాప్ కొత్త ఫీచర్ ఎక్కువ సార్లు ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను శోధించడానికి సులభమైన మార్గాన్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బ్రౌజర్ ఫీచర్ను కొత్తగా పరిచయం చేసింది. వినియోగదారులకు వచ్చిన సందేశాలకు సంబంధించిన వివరాలను ఈ బ్రౌజర్ అందిస్తుంది. ఏదేని సందేశం గురించి శోధన చేయాలనుకుంటే దాని పక్కనే ఉండే ఈ బ్రౌజర్ ఫీచర్పై క్లిక్ చేసినట్లైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







