సేఫ్టీ మెజర్స్‌తో అల్‌ అయిన్‌ జూ పునఃప్రారంభం

- August 05, 2020 , by Maagulf
సేఫ్టీ మెజర్స్‌తో అల్‌ అయిన్‌ జూ పునఃప్రారంభం

యూఏఈ: అల్‌ అయిన్‌ జూ, సందర్శకుల కోసం తిరిగి ప్రారంభమయ్యింది. జూ మేనేజ్‌మెంట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జూ పనిచేస్తుంది. షేక్‌ జాయెద్‌ డిజర్ట్‌ లెర్నింగ్‌ సెంటర్‌ కూడా రీ-ఓపెన్‌ చేశారు. అల్‌ అయిన్‌ జూ డైరెక్టర్‌ జనరల్‌ ఘానిం ముబారక్‌ అల్‌ హజెరి మాట్లాడుతూ, జూలో అన్ని ప్రికాషన్స్‌ తీసుకున్నట్లు వెల్లడించారు. రోజులో 1,800 మంది కంటే ఎక్కువమంది విజిటర్స్‌ని అనుమతించబోమని పేర్కొన్నారాయన. షేక్‌ జాయెద్‌ డిజర్ట్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో 53 మంది విజిటర్స్‌కి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఎలక్ట్రానిక్‌ టికెట్‌ బుకింగ్‌ విధానంలో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి వుంటుంది. టిక్కెట్‌ కౌంటర్లు కూడా అందుబాటులో వుంటాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com