కువైట్ : స్వాతంత్య్ర వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వేడుకలు
- August 07, 2020
కువైట్: కరోనా నేపథ్యంలో కువైట్ రాయబార కార్యాలయం స్వతంత్ర్య వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాయబార కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే పబ్లిక్ సెలబ్రేషన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 15న ప్రవాసభారతీయులు, భారత శ్రేయోభిలాషులు ఎవరూ రాయబార కార్యాలయానికి రావొద్దని అధికారులు సూచించారు. అయితే..ఆన్ లైన్ ద్వారా త్రివర్ణ పతాకావిష్కరణ, రాయబార కార్యాలయం ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేసమయంలో స్వతంత్ర్య వేడుకలను నేరుగా చూసే అవకాశం కొల్పోతున్నవారి కోసం ఆన్ లైన్ లో జాతీయ గీతం యాక్టివిటిని నిర్వహిస్తున్నారు. కువైట్ లోని ప్రవాసభారతీయులు జాతీయ గీతాన్ని ఆలపించి దాన్ని రికార్డ్ చేసి తమకు పంపించాలని కోరింది. రికార్డ్ చేసిన జాతీయ గీతంతో పాటు తమ పేరు, వయస్సు, ఇతర కాంటాక్ట్ వివరాలను [email protected] కు పంపించాలని రాయబార కార్యాలయం తెలిపింది. అందులో ఎంపిక చేసిన గీతాన్ని తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లు Facebook (@indianembassykuwait), Twitter (@indembkwt) లో అప్ లోడ్ చేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







