భారీ పుస్తకాలు వద్దు.. నూతన విద్యా విధానంపై ప్రధాని మోదీ
- August 07, 2020
న్యూ ఢిల్లీ:పిల్లలకు సిలబస్ పేరుతో భారీ పుస్తకాలు అవసరంలేదని.. పిల్లల మనోవికాసం పెంచే సిలబస్ ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. నూతన జాతీయ విద్యావిధానంపై ప్రసంగించిన మోదీ.. ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానంలో సంచలన మార్పులు తీసుకొచ్చామని.. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ముప్పై ఏళ్ల తరువాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని అన్నారు. పిల్లలు నచ్చిన కోర్సు చదువుకునే విధంగా మార్పులు చేశామని.. విద్యార్థులకు ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్పులు తెచ్చామని, ఈ మార్పులు దేశ భవిష్యత్ అవసరమని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానంపై ఆందోళన వద్దని.. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







