ఖతార్‌: 267 కరోనా పాజిటివ్‌ కేసులు

- August 08, 2020 , by Maagulf
ఖతార్‌: 267 కరోనా పాజిటివ్‌ కేసులు

మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్‌ 8న దేశంలో కొత్తగా 267 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 296 మంది రికవర్‌ అయ్యారు. కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 112650 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిల్లో 3030 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 182 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 2895 కరోనా టెస్టులు జరిగాయి.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com