కువైట్: మధ్యాహ్నం వేళలో పని నిబంధనలు ఉల్లంఘించిన 365 మంది కార్మికులు
- August 09, 2020
కువైట్ సిటీ:కువైట్ లో మధ్యాహ్నం పనివేళలపై నిషేధం ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పగటి వేళలో కార్మికులు పని చేస్తున్నట్లు మరో 59 ఫిర్యాదులు వచ్చాయని మానవ వనరుల శాఖ పౌర సంబంధాల విభాగం వెల్లడించింది. తమకు అందిన ఫిర్యాదుల మేరకు పలు పని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 161 చోట్ల తనిఖీలు నిర్వహించి 266 కంపెనీల్లో మధ్యాహ్నం పని వేళల్లో నిషేధం అమలు తీరుపై ఎంక్వరీ చేశామన్నారు. తమ తనిఖీల్లో 365 మంది కార్మికులు పగటి పూట ఓపెన్ ప్లేసుల్లో పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిబంధనల అమలును బేఖాతరు చేసిన వారి వివరాలు నమోదు చేసుకొని తొలి తప్పు కింద హెచ్చరించినట్లు అధికారులు వివరించారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తగిలే ప్రాంతాల్లో పనిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







