కువైట్: మధ్యాహ్నం వేళలో పని నిబంధనలు ఉల్లంఘించిన 365 మంది కార్మికులు

- August 09, 2020 , by Maagulf
కువైట్: మధ్యాహ్నం వేళలో పని నిబంధనలు ఉల్లంఘించిన 365 మంది కార్మికులు

కువైట్ సిటీ:కువైట్ లో మధ్యాహ్నం పనివేళలపై నిషేధం ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పగటి వేళలో కార్మికులు పని చేస్తున్నట్లు మరో 59 ఫిర్యాదులు వచ్చాయని మానవ వనరుల శాఖ పౌర సంబంధాల విభాగం వెల్లడించింది. తమకు అందిన ఫిర్యాదుల మేరకు పలు పని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 161 చోట్ల తనిఖీలు నిర్వహించి 266 కంపెనీల్లో మధ్యాహ్నం పని వేళల్లో నిషేధం అమలు తీరుపై ఎంక్వరీ చేశామన్నారు. తమ తనిఖీల్లో 365 మంది కార్మికులు పగటి పూట ఓపెన్ ప్లేసుల్లో పని చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిబంధనల అమలును బేఖాతరు చేసిన వారి వివరాలు నమోదు చేసుకొని తొలి తప్పు కింద హెచ్చరించినట్లు అధికారులు వివరించారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తగిలే ప్రాంతాల్లో పనిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com