‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నన్నెంతగానో ఆకట్టుకుంది:రామ్చరణ్
- August 10, 2020
సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియావర్క్స్, మహాయాణ పిక్చర్స్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్గా విడుదలై సూపర్హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకులను ఈ చిత్రం దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన మెగాపవర్స్టార్ రామ్చరణ్ తేజ్ చిత్ర యూనిట్కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
‘‘రీసెంట్గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నా మనసుకెంతో నచ్చింది. అద్భుతమైన కంటెంట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యదేవ్, నరేశ్గారు, సుహాస్, హరి చందన, రూప తదితరుల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్కు అభినందనలు’ అన్నారు రామ్ చరణ్.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







