మస్కట్:స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వీక్షణ
- August 11, 2020
మస్కట్: కరోనా నేపథ్యంలో మస్కట్ లోని భారత రాయభారి కార్యాలయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15న మస్కట్ లోని భారత రాయభారి కార్యాలయం లో వేడుక జరుగుతుందని, కానీ, వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత రాయభారి కార్యాలయం లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కు ప్రవాసభారతీయులు, భారత శ్రేయోభిలాషులు ను రావద్దని కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
74వ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాయభారి మును మహావర్, ఆగస్ట్ 15న ఉదయం 08:45కు జండా వందనం కావించి భారత రాష్ట్రపతి యొక్క సందేశాన్ని చదువుతారు.ఈ వేడుకలకు కేవలం భారత రాయభారి కార్యాలయం అధికారులు మాత్రమే హాజరవ్వనున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ వేడుకలకు అనుమతించబడరు, అయితే..ఆన్ లైన్ ద్వారా త్రివర్ణ పతాకావిష్కరణ, కార్యాలయం ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షిండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని రాయభారి కార్యాలయం స్పష్టం చేసింది.
ఫెస్బుక్ లో వీక్షించేందుకు: @IndiaInOman
ట్విట్టర్ లో వీక్షించేందుకు: @Indemb_Muscat
ఇంస్టాగ్రామ్ వీక్షించేందుకు:@indemb_muscat
తాజా వార్తలు
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!







