సిటిజన్స్, రెసిడెన్సీలపై ట్రాఫిక్ ఫైన్స్ ప్రచారాన్ని ఖండించిన అంతర్గత మంత్రిత్వశాఖ
- August 13, 2020
కువైట్: ట్రాఫిక్ చట్టాన్ని అనుసరించి పౌరులు, ప్రవాసీయులపై జరిమానాలు విధించారన్న ప్రచారాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖండించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై జరిమానాలు విధించారంటూ ఇటీవలె సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుతం తమ అధికారిక వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నామని..అందువల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన విజువల్స్ తమకు అందుబాటులో లేవని కూడా స్పష్టం చేసింది. ఏదైనా విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేటప్పుడు సంబంధిత అధికారిక వర్గాల నుంచి కన్ఫమ్ చేసుకోవాలని మంత్రిత్వ శాఖలోని పౌరసంబంధాలు, భద్రతా వ్యావహారాల సాధారణ విభాగం అధికారులు సూచించారు. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు తము ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్తగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు
- అమెరికా-ఇరాన్ అణు డీల్ ఖరారు..
- ఐపీఎల్ తరహాలోనే హోరాహోరీ..జూన్ 20 నుంచి లీగ్ షురూ!
- శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర
- అత్యంత వైభవంగా NATS సాంస్కృతిక సంబరాలు
- వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం- 15- 30 రౌండ్ల ఫైరింగ్
- నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
- లక్కీ డ్రా విజేత సంఖ్యలను వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- ఈద్ అల్ అదా.. 4 ఎమిరేట్లలో ఫ్రీ పార్కింగ్..!!









