హీరో సాయితేజ్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ కొత్తచిత్రం
- August 14, 2020కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. భారీ హిట్ చిత్రాలకు కేరాఫ్ అయిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, వైవిధ్యమైన కథాంశాలను ప్రాధాన్యమిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై స్టార్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు.
ఈ పోస్టర్లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు షట్చక్రంలో ఓ కన్ను చూపిస్తున్నారు. అసలు ఈ కన్ను, షట్చక్రం, సంస్కృత వాక్యం వెనకున్న కథేంటనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. మిస్టీక్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..