దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
- August 15, 2020
దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు భారత కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి జాతీయ జెండాను ఎగురవేశారు. మహమ్మారి కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమానికి పబ్లిక్ను అనుమతించలేదు. కేవలం కార్యాలయం సిబ్బంది, అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో దుబాయ్ లోని భారత ప్రవాసులు ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారిక సోషల్ మీడియా లో ప్రవాసుల కోసం ఈ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుబాయ్ కి చెందిన ప్రముఖ గాయకుడు సూరజ్ భారతి దేశభక్తి గీతం పాడగా, ఒక నృత్య బృందం వేదిక వద్ద శాస్త్రీయ నృత్యాలు చేసింది.
అనంతరం కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి ఈ సభలో ప్రసంగించారు. భారతీయ సమాజంలోని సభ్యులు, మా ఎమిరాటి స్నేహితులు,దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
తాజా వార్తలు
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..
- హైదరాబాద్లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం









