ఏపీలో కొత్తగా 8,732 కరోనా పాజిటివ్ కేసులు...
- August 15, 2020
అమరావతి:ఏ.పీలో కొత్తగా మరో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,81,817కి చేరింది. కరోనాతో గడచిన 24 గంటల్లో మరో 87 మంది మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా టెస్టులు చేయగా... మొత్తం టెస్టుల సంఖ్య 28,12,197కి చేరింది. తాజాగా మరో 10,414 మంది కరోనా నుంచి కోలుకుని కోవిడ్ 19 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 1,91,117 మంది డిశ్చార్జి అవగా.. ప్రస్తుతం 88,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా,ఇటీవల ఏ.పీలో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కరోనాపై సమగ్ర సమాచారం కోసం హెల్ప్లైన్ 82971 04104 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. కరోనా సోకితే కనిపించే లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పరీక్షల వివరాలను హెల్ప్ లైన్ ద్వారా వివరించనున్నారు. కరోనా సోకితే ఎవరిని సంప్రదించాలి... ఏం చేయాలన్న సందిగ్ధం ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో ఈ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







