ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి బీఎల్ఎస్ సేవా కేంద్రాలు
- August 17, 2020
యూఏఈ:లాక్ డౌన్ ఇన్నాళ్లుగా నిలిచిపోయిన బీఎల్ఎస్ సేవా కేంద్రాలు..ఇక ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు పాస్ పోర్ట్, ఇతర సేవలు పూర్తి స్థాయిలో అందనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్ట్ 24 నుంచి సేవలు ప్రారంభించనున్న బీఎల్ఎస్ కేంద్రాల వివరాలు...దుబాయ్ లోని కేరళా ముస్లిం కల్చర్ సెంటర్ లోని మొదటి అంతస్తు, రూం నెం. 102లో ఉంది. మరోటి రస్ అల్ ఖైమాలోని ఇండియన్ స్కూల్ పక్క బిల్డింగ్ లో ఇండియన్ రిలీఫ్ కమిటీలో ఉంది. ఈ రెండు బీఎల్ఎస్ సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రెండు కేంద్రాల్లో ఆన్ లైన్ అపాయింట్మెంట్ సేవలు ఈ రోజు (ఆగస్ట్ 17) నుంచి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







