హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో చోరీ... ట్రోఫీలు మాయం..

- August 18, 2020 , by Maagulf
హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో చోరీ... ట్రోఫీలు మాయం..

 

హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో చోరీ జరిగింది. తెలంగాణ ఫుట్​బాల్​ అసోసియేషన్​ కార్యాలయంలో ఉంచిన ట్రోఫీలు మాయమయ్యాయి. కరోనా వల్ల గత నెలలో అసోసియేషన్​ కార్యదర్శి జీపీ.. కార్యాలయానికి గత నెల చివర్లో తాళం వేశారు. 20 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వెళ్లి చూడగా.. తాళం పగులగొట్టి ఉంది. అయితే దొంగలు పడ్డారనే అనుమానంతో లోపలికి వెళ్లి చూస్తే... ఆయనకు ట్రోఫీలు ఉన్న కప్బోర్డు పగులగొట్టి కనిపించింది. అయితే ఆ కప్బోర్డులోని ఒక వెండి, 15 ఇత్తడి ట్రోఫీలు మాయమవ్వడం గమనించిన కార్యదర్శి జీపీ.. సైఫాబాద్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com