ఐపీఎల్ 2020: స్పాన్సర్ షిప్ టైటిల్ గెల్చుకున్న డ్రీమ్ 11
- August 18, 2020
ఫాంటరీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ని గెల్చుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. 222 కోట్ల రూపాయలతో ఈ టైటిల్ని డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఆగస్ట్ 10న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది. చైనా - భారత్ మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో చైనాకి చెందిన వివో సంస్థ, స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్న విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ పోటీలు ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!