ఐపీఎల్ 2020: స్పాన్సర్ షిప్ టైటిల్ గెల్చుకున్న డ్రీమ్ 11
- August 18, 2020
ఫాంటరీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ని గెల్చుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. 222 కోట్ల రూపాయలతో ఈ టైటిల్ని డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఆగస్ట్ 10న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది. చైనా - భారత్ మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో చైనాకి చెందిన వివో సంస్థ, స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్న విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ పోటీలు ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







