ఐపీఎల్ 2020: స్పాన్సర్ షిప్ టైటిల్ గెల్చుకున్న డ్రీమ్ 11
- August 18, 2020
ఫాంటరీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ని గెల్చుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. 222 కోట్ల రూపాయలతో ఈ టైటిల్ని డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఆగస్ట్ 10న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), స్పాన్సర్ షిప్ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది. చైనా - భారత్ మధ్య తలెత్తిన సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో చైనాకి చెందిన వివో సంస్థ, స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా జరగనున్న విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ పోటీలు ఇండియాలో కాకుండా యూఏఈలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారం పై యూఏఈ అధ్యక్షుడు–బ్రిటన్ ప్రధాని చర్చలు
- కోల్కతా పై లక్నో విజయం
- ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!
- సీజ్ఫైర్ ఒప్పందం..ఇరాన్ డిమాండ్స్, అమెరికా ప్రతిపాదనలు
- CPTOగా ప్రసన్న ప్రసాద్ నియామకం
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!









