13 దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పంద చర్చలు-హర్దీప్ సింగ్ పురీ
- August 18, 2020
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎయిర్ బబూల్ ఒప్పందానికి సంబంధించి మరో 13 దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ గురువారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీ విమానాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇతర దేశాలు కూడా ఇదే విధమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య ఎయిర్ బబూల్ ఒప్పందం జరిగితే ఇరు దేశాల మధ్య అతి తక్కువ ఆంక్షలతో అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు అనుమతి లభిస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం జూలై నుండి అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మని, యూఏఈ, ఖతర్, మాల్దీవుల ప్రభుత్వాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, సౌత్ కొరియా, థాయ్ల్యాండ్ ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నట్టు హర్దీప్ సింగ్ పురి తెలిపారు. సరిహద్దు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలను కూడా సంపద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడం వల్ల ఇరు దేశాల్లో చిక్కుకున్న వారికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







