13 దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పంద చర్చలు-హర్దీప్ సింగ్ పురీ
- August 18, 2020
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎయిర్ బబూల్ ఒప్పందానికి సంబంధించి మరో 13 దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ గురువారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీ విమానాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇతర దేశాలు కూడా ఇదే విధమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య ఎయిర్ బబూల్ ఒప్పందం జరిగితే ఇరు దేశాల మధ్య అతి తక్కువ ఆంక్షలతో అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు అనుమతి లభిస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం జూలై నుండి అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మని, యూఏఈ, ఖతర్, మాల్దీవుల ప్రభుత్వాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, సౌత్ కొరియా, థాయ్ల్యాండ్ ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నట్టు హర్దీప్ సింగ్ పురి తెలిపారు. సరిహద్దు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలను కూడా సంపద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడం వల్ల ఇరు దేశాల్లో చిక్కుకున్న వారికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









