దుబాయ్ టు ఇండియా: ప్రీ ట్రావెల్ టెస్టింగ్ రెగ్యులేసన్స్ అప్డేట్
- August 20, 2020
యూఏఈ:ప్రీ ట్రావెల్ కోవిడ్ 19 టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ విషయంలో రెండు ప్రధాన ఎయిర్లైన్స్ అప్డేట్ని విడుదల చేశాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం ఈ అప్డేట్ని విడుదల చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ని తమతో తీసుకువెళ్ళాల్సి వుంటుందని ఫ్లై దుబాయ్ అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పష్టం చేశాయి. ప్రీ ట్రావెల్ ర్యాపిడ్ ఐజిజి / ఐజిజిఎం టెస్టింగ్ తప్పనిసరి కాదని ఫ్లై దుబాయ్ పేర్కొంది. ప్రయాణానికి 96 గంటలు ముందుగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటేనే అది చెల్లుబాటవుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెబుతోంది. 12 ఏళ్ళ లోపు చిన్నారులు.. సాధారణ నుంచి ఓ మోస్తరు డిజేబిలిటీ కలిగి వుంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు వుంటుంది. కాగా, ప్రయాణీకులు ఎయిర్ సువిధా సెల్ఫ్ రిపోర్టింగ్ సర్టిఫికెట్ని ఆన్లైన్లో నింపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!