దుబాయ్‌ టు ఇండియా: ప్రీ ట్రావెల్‌ టెస్టింగ్‌ రెగ్యులేసన్స్‌ అప్‌డేట్‌

- August 20, 2020 , by Maagulf
దుబాయ్‌ టు ఇండియా: ప్రీ ట్రావెల్‌ టెస్టింగ్‌ రెగ్యులేసన్స్‌ అప్‌డేట్‌

యూఏఈ:ప్రీ ట్రావెల్‌ కోవిడ్‌ 19 టెస్టింగ్‌ రిక్వైర్‌మెంట్స్‌ విషయంలో రెండు ప్రధాన ఎయిర్‌లైన్స్‌ అప్‌డేట్‌ని విడుదల చేశాయి. దుబాయ్‌ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం ఈ అప్‌డేట్‌ని విడుదల చేయడం జరిగింది. దుబాయ్‌ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్‌ 19 నెగెటివ్‌ పిసిఆర్‌ టెస్ట్‌ రిజల్ట్‌ని తమతో తీసుకువెళ్ళాల్సి వుంటుందని ఫ్లై దుబాయ్‌ అలాగే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ స్పష్టం చేశాయి. ప్రీ ట్రావెల్‌ ర్యాపిడ్‌ ఐజిజి / ఐజిజిఎం టెస్టింగ్‌ తప్పనిసరి కాదని ఫ్లై దుబాయ్‌ పేర్కొంది. ప్రయాణానికి 96 గంటలు ముందుగా కోవిడ్‌ 19 పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకుంటేనే అది చెల్లుబాటవుతుందని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ చెబుతోంది. 12 ఏళ్ళ లోపు చిన్నారులు.. సాధారణ నుంచి ఓ మోస్తరు డిజేబిలిటీ కలిగి వుంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు వుంటుంది. కాగా, ప్రయాణీకులు ఎయిర్‌ సువిధా సెల్ఫ్ రిపోర్టింగ్‌ సర్టిఫికెట్‌ని ఆన్‌లైన్‌లో నింపాల్సి వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com