దుబాయ్ టు ఇండియా: ప్రీ ట్రావెల్ టెస్టింగ్ రెగ్యులేసన్స్ అప్డేట్
- August 20, 2020
యూఏఈ:ప్రీ ట్రావెల్ కోవిడ్ 19 టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ విషయంలో రెండు ప్రధాన ఎయిర్లైన్స్ అప్డేట్ని విడుదల చేశాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం ఈ అప్డేట్ని విడుదల చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ని తమతో తీసుకువెళ్ళాల్సి వుంటుందని ఫ్లై దుబాయ్ అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పష్టం చేశాయి. ప్రీ ట్రావెల్ ర్యాపిడ్ ఐజిజి / ఐజిజిఎం టెస్టింగ్ తప్పనిసరి కాదని ఫ్లై దుబాయ్ పేర్కొంది. ప్రయాణానికి 96 గంటలు ముందుగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటేనే అది చెల్లుబాటవుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెబుతోంది. 12 ఏళ్ళ లోపు చిన్నారులు.. సాధారణ నుంచి ఓ మోస్తరు డిజేబిలిటీ కలిగి వుంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు వుంటుంది. కాగా, ప్రయాణీకులు ఎయిర్ సువిధా సెల్ఫ్ రిపోర్టింగ్ సర్టిఫికెట్ని ఆన్లైన్లో నింపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







