వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభాకాంక్షలు

- August 21, 2020 , by Maagulf
వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ శుభాకాంక్షలు

అమరావతి:వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.  

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com