బీచ్‌కి వెళుతున్నారా.? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

- August 21, 2020 , by Maagulf
బీచ్‌కి వెళుతున్నారా.? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

దుబాయ్:బీచ్‌కి వెళ్ళి ఎంజాయ్‌ చెయ్యాలనుకునేవారికి దుబాయ్‌ పోలీస్‌ కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో తగిన ప్రికాషన్స్‌ తీసుకోవాలని దుబాయ్‌ పోలీస్‌, బీచ్‌ గోయర్స్‌కి సూచించారు. అతి ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సి వుంటుంది. సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించడం కూడా తప్పనిసరి. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదు. కుటుంబ సభ్యులకు ఈ విషయంలో కాస్త మినహాయింపు వుంది. నిబంధనల్ని పాటించనివారికి జరీమానాలు తప్పవని దుబాయ్‌ పోలీస్‌ హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ ధరించనివారికి, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించనివారికి 3,000 దిర్హామ్ వరకు జరీమానా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com