డిస్టెన్స్ లర్నింగ్ వైపే సౌదీ ప్రభుత్వం మొగ్గు...
- August 23, 2020
రియాద్:సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రస్తుతానికి డిస్టెన్స్ లర్నింగ్ ద్వారానే విద్యావిధానం కొనసాగించాలనే నిర్ణయంతో ఉంది. ఆగస్ట్ 30న ఈ విద్య సంవత్సరం ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో స్కూల్స్ నిర్వహణపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరగతుల నిర్వహణ తమ అభిప్రాయాలను వెల్లడించింది. ఆగస్ట్ 30 నుంచి తొలి ఏడు నెలలు డిస్టెన్స్ లర్నింగ్ ద్వారానే విద్యా విధానాన్ని కొనసాగిస్తామని, ఆ తర్వాతే క్లాస్ అటెండెన్స్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది. ఒక వేళ ఆలోగా కోవిడ్ 19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుంటే డిస్టెన్స్ లెర్నింగ్ విధానాన్ని పొడిగిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి కోవిడ్ 19 ప్రభావంపై అంతా గందరగోళ వాతావరణమే కనిపిస్తోందని, వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు, ఏడువారాల తర్వాత వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అందువల్ల తొలి ఏడు వారాలు దూర విద్య ద్వారా తరగతులు నిర్వహించి ఆ తర్వాత అప్పటి పరిస్థితులు, కరోనా తీవ్రత, వ్యాక్షిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలను సమీక్షించుకొని క్లాస్ అటెండెన్స్ పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఒక వేళ వ్యాక్సిన్ రావటం మరింత ఆలస్యం అవుతుంది అనుకుంటే దూర విద్య విధానాన్ని మరికొన్నాళ్లు పొడిగించే అవకాశాలు లేకపోలేదని తెలిపింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







