కిరాక్ ఆర్.పి దర్శకత్వంలో జే.డి చక్రవర్తి ప్రధాన ప్రాతగా నూతన చిత్రం ప్రారంభం
- August 23, 2020
జబర్ధస్థ్ కామెడీ షోతో తెలుగు ప్రజలకి సుపరిచితమైన కమీడియన్ కిరాక్ ఆర్.పి దర్శకునిగా మారారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై కోవూరు అరుణాచలం నిర్మాతగా కిరాక్ ఆర్.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం 1 సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను జే.డి చక్రవర్తి పోషిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ మూవీ ఆఫీసులో జరిగిన పూజా కార్యక్రమానికి వెండితెర, బుల్లితెర రంగాలకి చెందిన వివిధ ప్రముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారిలో జే.డి.చక్రవర్తితో పాటు, మెగా బ్రదర్ నాగబాబు, జబర్ధస్థ్ కామెడీ షోకి చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సందర్భంగా
దర్శకుడు కిరాక్ ఆర్.పి మాట్లాడుతూ
గత కొన్నేళ్లుగా జబర్ధస్థ్ కామెడీ షో ద్వారా నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుదరడంతో దర్శకునిగా ఆడియెన్స్ ముందుకి రావడానికి నిశ్చయించుకున్నాను. నా మీద నమ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా, నా డైరక్షన్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జేడీచక్రవర్తి కీలక పాత్ర పోషించడానికి అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విలక్షణంగా ఉంటుంది. జే.డి.చక్రవర్తితో పాటు, ప్రకాశ్ రాజ్, రావురమేశ్, జబర్ధస్థ్ ఆదిత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో హైదరాబాద్, నెల్లూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు.
తారాగాణం
జే.డి.చక్రవర్తి, ప్రకాశ్ రాజ్, రావురమేశ్, జబర్ధస్థ్ ఆదిత్య తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - పద్మపూజిత పిక్చర్స్
నిర్మాత - కోవూరు అరుణాచలం
మ్యూజిక్ - చరణ్ అర్జున్
పీ.ఆర్.ఓ - ఏలూరు శ్రీను
దర్శకత్వం - కిరాక్ ఆర్.పి
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







