యూఏఈ:అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వందల కొద్ది వాహనాలకు భారీగా జరిమానాలు
- August 24, 2020
యూఏఈ:అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా తాత్సారం చేసే వాహనదారులపై కొరఢా ఝులిపించారు. గతేడాదికిగాను 400 మంది వాహనదారులకు జరిమానాలు విధించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. 2019లో మొత్తం 424 మంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఆంబులెన్స్ లు, ఫైర్ ఇంజిన్లు, పాట్రోల్ వాహనాల లాంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవటం అంటే ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలతో చెలగాటం ఆటడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రిత్వ శాఖ..నిబంధనల ఉల్లంఘనులకు గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా జరిమానా విధించింది. ఒక్కో వాహనదారుడికి Dh3000 ఫైన్ తో పాటు..నెల పాటు వాహనాలను జప్తు చేసింది. గతంలో అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వారికి Dh1000 జరిమానాతో పాటు 6 బ్లాక్ పాయింట్లు విధించేవారు. ఆంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, పోలీస్ పాట్రోలింగ్ వాహనాలకు దారి ఇవ్వకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించేందుకు ఆలస్యం అవుతుందన్న విషయాన్ని దేశ పౌరులు, ప్రవాసీయులు గుర్తుంచుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అందువల్ల ప్రతి వాహనదారుడు అత్యవసర వాహనాలకు విధిగా దారి ఇవ్వాలని కోరింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







