కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా గాంధీ
- August 24, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుధీర్ఘ సమయం చర్చలు సాగాయి. పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా చర్చ జరిగింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ సోనియానే కొనసాగాలని కోరిన సీనియర్లు. మన్మోహన్ సింగ్, ఆంటోనీలు సోనియావైపే మొగ్గు చూపుతున్నారు.
కాగా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో అధ్యక్షుడ్ని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు. పార్టీలో సమర్ధవంతమైన నాయకత్వం గురించి 20 మంది పార్టీ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా అసంతృప్తికి లోనయినట్లు సమాచారం. కాగా మాజీ ప్రధాని మన్మోహన్, మరో సీనియర్ నేత ఏకే ఆంటోనిలు.. సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







