తెలంగాణ:రాజ్ భవన్ లో గణేష్ నిమజ్జనం

- August 24, 2020 , by Maagulf
తెలంగాణ:రాజ్ భవన్ లో గణేష్ నిమజ్జనం

హైదరాబాద్:రాజ్ భవన్ చారిత్రక దర్బార్ హాల్ లో గత మూడు రోజులుగా పూజలందుకుంటున్న గణేశుడి విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం నిమజ్జనం చేశారు. 
నిమజ్జనానికి ముందు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సౌందరరాజన్ తో కలిసి దర్బార్ హాల్ లో వేసిన మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా గవర్నర్ దంపతులు రోజూ ఈ మంటపంలో గణేశునికి పూజలు నిర్వహిస్తున్నారు. 

ఈరోజు జరిగిన పూజలో గవర్నర్ దంపతులతో పాటు గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం, పోలీసు అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.రాజ్ భవన్ ఆవరణలోని ఫిష్ పాండ్ లో గణేశ నిమజ్జనం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com