తెలంగాణ:రాజ్ భవన్ లో గణేష్ నిమజ్జనం
- August 24, 2020
హైదరాబాద్:రాజ్ భవన్ చారిత్రక దర్బార్ హాల్ లో గత మూడు రోజులుగా పూజలందుకుంటున్న గణేశుడి విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం నిమజ్జనం చేశారు.
నిమజ్జనానికి ముందు గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్, ఆమె భర్త ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సౌందరరాజన్ తో కలిసి దర్బార్ హాల్ లో వేసిన మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత మూడు రోజులుగా గవర్నర్ దంపతులు రోజూ ఈ మంటపంలో గణేశునికి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈరోజు జరిగిన పూజలో గవర్నర్ దంపతులతో పాటు గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘుప్రసాద్, అనుసంధాన అధికారి సి.హెచ్. సీతారాములు, డా. కె. రాజారాం, పోలీసు అధికారులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు.రాజ్ భవన్ ఆవరణలోని ఫిష్ పాండ్ లో గణేశ నిమజ్జనం చేశారు.


తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







