రస్ ఆల్ ఖైమాలో వాణిజ్య సంస్థలకు ఊరట..లైసెన్స్ ఫీజుల రాయితీ, ఫైన్స్ మాఫీ
- August 24, 2020
యూఏఈ:కరోనా నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి రస్ ఆల్ ఖైమా ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వాణిజ్య సంస్థల ట్రెడ్ లైసెన్స్ ఫీజులో రాయితీలు ఇచ్చారు. అలాగే లాక్ డౌన్ సమయంలో విధించిన జరిమానాలను అన్నింటిని మాఫీ చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రస్ అల్ ఖైమా పారిశ్రామిక రంగానికి చేయూతగా నిలిచేందుకు రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాల మేరకు ఈ మినహాయింపులు ప్రకటించారు. ప్రస్తుతం రస్ అల్ ఖైమా వాణిజ్య రంగం మెరుగైన ఫలితాలే సాధిస్తున్నప్పటికీ... దేశ ఆర్ధిక రంగానికి కీలకమైన పారిశ్రామిక రంగంలో మళ్లీ సాధారణ స్థాయిని కల్పించటమే లక్ష్యంగా ఈ వెసులుబాట్లు కల్పించారు. దీంతో పలు పరిశ్రలమకు తమ వార్షిక వాణిజ్య లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ దక్కనుంది. ఇక లాక్ డౌన్ మార్గనిర్దేశకాల మేరకు మూతపడిన సంస్థలకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మరోవైపు లాక్ డౌన్ సమయంలో వాణిజ్య సంస్థలపై విధించిన జరిమానాలను మాత్రం పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు రస్ అల్ ఖైమా ఆర్ధికాభివృద్ధి అధికార విభాగం ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







