రస్ ఆల్ ఖైమాలో వాణిజ్య సంస్థలకు ఊరట..లైసెన్స్ ఫీజుల రాయితీ, ఫైన్స్ మాఫీ
- August 24, 2020
యూఏఈ:కరోనా నేపథ్యంలో పారిశ్రామిక రంగానికి రస్ ఆల్ ఖైమా ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వాణిజ్య సంస్థల ట్రెడ్ లైసెన్స్ ఫీజులో రాయితీలు ఇచ్చారు. అలాగే లాక్ డౌన్ సమయంలో విధించిన జరిమానాలను అన్నింటిని మాఫీ చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రస్ అల్ ఖైమా పారిశ్రామిక రంగానికి చేయూతగా నిలిచేందుకు రూలర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమి ఆదేశాల మేరకు ఈ మినహాయింపులు ప్రకటించారు. ప్రస్తుతం రస్ అల్ ఖైమా వాణిజ్య రంగం మెరుగైన ఫలితాలే సాధిస్తున్నప్పటికీ... దేశ ఆర్ధిక రంగానికి కీలకమైన పారిశ్రామిక రంగంలో మళ్లీ సాధారణ స్థాయిని కల్పించటమే లక్ష్యంగా ఈ వెసులుబాట్లు కల్పించారు. దీంతో పలు పరిశ్రలమకు తమ వార్షిక వాణిజ్య లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ దక్కనుంది. ఇక లాక్ డౌన్ మార్గనిర్దేశకాల మేరకు మూతపడిన సంస్థలకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మరోవైపు లాక్ డౌన్ సమయంలో వాణిజ్య సంస్థలపై విధించిన జరిమానాలను మాత్రం పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు రస్ అల్ ఖైమా ఆర్ధికాభివృద్ధి అధికార విభాగం ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?