అనుష్క అధికారిక ప్రకటన

- August 27, 2020 , by Maagulf
అనుష్క అధికారిక ప్రకటన

బాలీవుడ్ అందాల కథానాయిక అనుష్క శర్మ- క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈరోజు సోషల్ మీడియాలో బేబీ ప్రకటన చేశారు. మేము ఇద్దరమూ ముగ్గురు కాబోతున్నామని అంటూ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో రాశారు. బేబీ జనవరి 2021లో వస్తాడు.. అంటూ వెళ్లడించారు. మొత్తానికి జూనియర్ విరాట్ ఆగమానికి సమయం వచ్చేసిందన్నమాట. దీంతో అప్పుడే సోషల్ మీడియాలో వారి అభిమానులు శుభాభివందనాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకున్న మూడేళ్ళకు తొలి సంతానానికి టైమ్ వచ్చింది. అనుష్క శర్మ గర్భధారణ కు సంబంధించిన తొలి ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విరాట్ దుబాయ్ లోని ఐపీఎల్ నిమిత్తం బీసీ బీసీగా ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com