భారత్ లో కరోనా కల్లోలం..
- August 30, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో గడిచిన 24 గంటల్లో ఏకంగా 79 వేల కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదో రికార్డు. జులై 25న అమెరికాలో ఒక్కరోజులో 78 వేల 427 కేసులు నమోదైతే ఇప్పుడు మన దగ్గర 78 వేల 903 కేసులు వచ్చాయి. USలో 76 వేలకుపైగా కేసులు పలు సందర్భాల్లో నమోదైనా.. ఈ వారం రోజుల నుంచే భారత్లో కరోనా మీటర్ మరింత పైపైకి వెళ్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశంలో 4 లక్షల 96 వేల మంది అంటే దాదాపుగా 5 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా సగటున గత వారం రోజులుగా 70 వేల 867 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే ఏకంగా 945 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







