మస్కట్: ఒమన్ లో కొత్తగా 178 కరోనా కేసులు..8 మంది మృతి
- August 31, 2020
ఒమన్ లో కొత్తగా 178 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 85,722 మందికి పెరిగింది. మృతుల సంఖ్య 685కి చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నా..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఊరట కలిగించే అంశం. 85 వేల మందికి కరోనా వైరస్ బారిన పడితే..అందులో 80,810 మంది కోలుకోవటం విశేషం. గత 24 గంటల్లో 178 మందికి వైరస్ సోకితే..351 మంది రికవరి అయ్యారు. ఇదిలాఉంటే..వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం నిబంధనను అనుసరించటంతో పాటు..ఫేస్క్ మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









