మస్కట్: ఒమన్ లో కొత్తగా 178 కరోనా కేసులు..8 మంది మృతి

- August 31, 2020 , by Maagulf
మస్కట్: ఒమన్ లో కొత్తగా 178 కరోనా కేసులు..8 మంది మృతి

ఒమన్ లో కొత్తగా 178 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా మరో ఎనిమిది మంది మృతి చెందినట్లు ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 85,722 మందికి పెరిగింది. మృతుల సంఖ్య 685కి చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నా..వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఊరట కలిగించే అంశం. 85 వేల మందికి కరోనా వైరస్ బారిన పడితే..అందులో 80,810 మంది కోలుకోవటం విశేషం. గత 24 గంటల్లో 178 మందికి వైరస్ సోకితే..351 మంది రికవరి అయ్యారు. ఇదిలాఉంటే..వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం నిబంధనను అనుసరించటంతో పాటు..ఫేస్క్ మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com