దుబాయ్ రెస్టారెంట్లో పేలిన గ్యాస్ సిలిండర్..ఓ వ్యక్తి మృతి
- August 31, 2020
దుబాయ్ లోని ఓ రెస్టారెంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆసియా దేశాలకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇంటర్నేషనల్ సిటీలోని నాలుగు అంతస్తుల రెస్టారెంట్ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని కిచెన్ లో వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్ లీక్ అవటంతో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. మంటలు వేగంగా వ్యాప్తించటంతో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి ధ్వంసమైనట్లు వివరించారు. సోమవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, తమకు సమాచారం అందగానే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని కేవలం 33 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేసినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. తదుపరి విచారణ కోసం ఘటన జరిగిన భవనాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వయస్సు వివరాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









