ఐపీఎల్ కు మరో షాక్..అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్ అవుట్!!
- September 02, 2020
యూఏఈ: ఈ ఏడాది ఐపీఎల్కు ప్రారంభం నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మార్చిలో ప్రారంభం కావల్సిన టోర్నీ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆ తరువాత ఎన్నో అడ్డంకులను దాటి బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. అయితే బాయ్ కాట్ చైనా నిరసనలతో వీవోను ప్రధాన ఫ్రాంచైజీ నుంచి తప్పించింది. ఆ తరువాత హడావుడిగా బిడ్డింగ్ నిర్వహించి సగం ధరకే డ్రీమ్11కు ఆ బాధ్య అప్పగించింది. టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకునే తరుణంటో బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్షిప్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
‘టోర్నీ నిర్వహణకు ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనిపై బీసీసీఐతో చర్చలు జరిపినా ప్రయోజనం కనపడేలేదు. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటున్నా’మని ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ఓ ప్రధాన అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఫ్రాంచైజీ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్న విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీ గడువు కూడా ముగియనుందని, కానీ ముందుగా తప్పుకొంటున్నందుకు బీసీసీఐకి ఆ కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







