ఐపీఎల్ కు మరో షాక్..అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్ అవుట్!!
- September 02, 2020యూఏఈ: ఈ ఏడాది ఐపీఎల్కు ప్రారంభం నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మార్చిలో ప్రారంభం కావల్సిన టోర్నీ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆ తరువాత ఎన్నో అడ్డంకులను దాటి బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. అయితే బాయ్ కాట్ చైనా నిరసనలతో వీవోను ప్రధాన ఫ్రాంచైజీ నుంచి తప్పించింది. ఆ తరువాత హడావుడిగా బిడ్డింగ్ నిర్వహించి సగం ధరకే డ్రీమ్11కు ఆ బాధ్య అప్పగించింది. టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకునే తరుణంటో బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్షిప్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
‘టోర్నీ నిర్వహణకు ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనిపై బీసీసీఐతో చర్చలు జరిపినా ప్రయోజనం కనపడేలేదు. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటున్నా’మని ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ఓ ప్రధాన అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఫ్రాంచైజీ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్న విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీ గడువు కూడా ముగియనుందని, కానీ ముందుగా తప్పుకొంటున్నందుకు బీసీసీఐకి ఆ కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ