ఐపీఎల్ కు మరో షాక్..అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్ అవుట్!!
- September 02, 2020
యూఏఈ: ఈ ఏడాది ఐపీఎల్కు ప్రారంభం నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మార్చిలో ప్రారంభం కావల్సిన టోర్నీ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆ తరువాత ఎన్నో అడ్డంకులను దాటి బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. అయితే బాయ్ కాట్ చైనా నిరసనలతో వీవోను ప్రధాన ఫ్రాంచైజీ నుంచి తప్పించింది. ఆ తరువాత హడావుడిగా బిడ్డింగ్ నిర్వహించి సగం ధరకే డ్రీమ్11కు ఆ బాధ్య అప్పగించింది. టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకునే తరుణంటో బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్షిప్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
‘టోర్నీ నిర్వహణకు ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనిపై బీసీసీఐతో చర్చలు జరిపినా ప్రయోజనం కనపడేలేదు. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటున్నా’మని ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ఓ ప్రధాన అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఫ్రాంచైజీ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్న విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీ గడువు కూడా ముగియనుందని, కానీ ముందుగా తప్పుకొంటున్నందుకు బీసీసీఐకి ఆ కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- మార్కెట్ స్టెబిలిటీ కోసం సీపీఏ ముమ్మర ప్రయత్నాలు..!!
- ఖతార్ లో పాస్పోర్ట్ డైరెక్టరేట్కు చెందిన 11 సేవా కేంద్రాలు, పని వేళలు..!!
- కువైట్ లో క్షిపణి, డ్రోన్ దాడుల్లో 10 మందికి గాయాలు..!!
- జెబెల్ అలీలో ప్రారంభమైన సూపర్ బజార్ హైపర్మార్కెట్..అపూర్వ ఆదరణ..!!
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు









