రిటైర్మెంట్ వీసా ను ప్రవేశపెట్టిన దుబాయ్
- September 03, 2020దుబాయ్: నివాసితులు లేదా 55 ఏళ్లు పైబడిన ఏ విదేశీయుడైనా ఇప్పుడు ఐదేళ్ల రిటైర్మెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసా కి దరఖాస్తు చేసుకోదలచినవారు http://www.retireindubai.com లో దరఖాస్తు చేసుకోవచ్చు అని సెప్టెంబర్ 2 న ప్రకటించబడింది. దీంతో పదవీ విరమణ పొందివారు తమ కొత్త ఇన్నింగ్స్ ను దుబాయ్లో ప్రారంభించవచ్చు.
అయితే ఈ వీసా పొందదలచినవారికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అవి, పదవీ విరమణ చేసినవారికి పెట్టుబడుల నుండి లేదా పెన్షన్ల నుండి నెలవారీ 20,000 దిర్హాముల ఆదాయం ఉండాలి; లేదా 1 మిలియన్ దిర్హాముల పొదుపు; లేదా దుబాయ్లో 2 మిలియన్ దిర్హాముల విలువైన ఆస్తి ఉండి ఉండాలి.
యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ పథకాన్ని దుబాయ్ టూరిజం మరియు రెసిడెన్సీ మరియు విదేశీయుల వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించింది.
దీర్ఘకాలిక నివాస వీసాలు..
2019 లో యూఏఈ దీర్ఘకాలిక నివాస వీసాల విధానాన్ని అమలు చేసింది. ఐదు మరియు 10 సంవత్సరాల వీసా పథకం క్రింద విదేశీయులకు లోకల్ స్పాన్సర్ అవసరం లేకుండా మరియు దేశ ప్రధాన భూభాగంలో వారి వ్యాపారం యొక్క 100 శాతం యాజమాన్యంతో యూఏఈ లో నివసించడానికి, పని చేసేందుకు మరియు విద్యను అభ్యసించేందుకు వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన..
- హాస్పటల్ లో చేరిన షారుఖ్
- బర్గాన్ బ్యాంక్తో మెగా డీల్ కుదుర్చుకున్న టీసీఎస్
- టెహ్రాన్లో సంతాపం తెలిపిన సౌదీ మంత్రులు
- బ్లూ వీసా: పర్యావరణంపై మెరుగైన ఉద్యోగ భద్రత..!
- ట్రాఫిక్ జరిమానాల పేమెంట్ పై ఖతార్ కీలక ఉత్తర్వులు..!
- పతకాలు అందుకున్న HM సుల్తాన్, జోర్డాన్ రాజు
- 5 రోజుల ఈద్ అల్ అదా సెలవులు.. వార్షిక సెలవుతో కలుపుతున్నారా?
- బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. నటి హేమ బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ ఆనవాళ్లు
- సత్య నాదెళ్లకు రూ.2 లక్షల జరిమానా: భారత్ ప్రభుత్వం