22 రోజుల్లో 400 కన్స్యుమర్‌ ఫిర్యాదులు

- September 05, 2020 , by Maagulf
22 రోజుల్లో 400 కన్స్యుమర్‌ ఫిర్యాదులు

మస్కట్‌: కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీకి 400కి పైగా ఫిర్యాదులు కేవలం 22 రోజుల్లోనే కన్స్యుమర్స్‌ నుంచి వచ్చాయి. ఈ మేరకు కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (పిఎసిపి) ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 25 నుంచి ఆగస్ట్‌ 15 వరకు మొత్తం 420 ఫిర్యాదులు అందాయి. సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫిర్యాదుల్ని అందుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫుడ్‌ కన్స్యుమబుల్స్‌, రెస్టారెంట్స్‌ అలాగే కేఫ్‌లు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, కాంట్రాక్టింగ్‌ మరియు బిల్డింగ్‌ మెటీరియల్స్‌, వెహికిల్‌ రిపెయిర్‌ వర్క్‌ షాప్‌లు వంటివాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిల్లో వున్నాయి. కన్స్యుమర్స్‌తో సంప్రదించి ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటూ, ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com