22 రోజుల్లో 400 కన్స్యుమర్ ఫిర్యాదులు
- September 05, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 400కి పైగా ఫిర్యాదులు కేవలం 22 రోజుల్లోనే కన్స్యుమర్స్ నుంచి వచ్చాయి. ఈ మేరకు కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ (పిఎసిపి) ఓ ప్రకటన విడుదల చేసింది. జులై 25 నుంచి ఆగస్ట్ 15 వరకు మొత్తం 420 ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియా ద్వారా ఈ ఫిర్యాదుల్ని అందుకున్నట్లు అథారిటీ పేర్కొంది. ఫుడ్ కన్స్యుమబుల్స్, రెస్టారెంట్స్ అలాగే కేఫ్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ డివైజ్లు, కాంట్రాక్టింగ్ మరియు బిల్డింగ్ మెటీరియల్స్, వెహికిల్ రిపెయిర్ వర్క్ షాప్లు వంటివాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిల్లో వున్నాయి. కన్స్యుమర్స్తో సంప్రదించి ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుంటూ, ఈ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







