ఖష్షోగీ హత్య కేసులో తీర్పుని స్వాగతించిన ఫ్యామిలీ లాయర్‌

- September 09, 2020 , by Maagulf
ఖష్షోగీ హత్య కేసులో తీర్పుని స్వాగతించిన ఫ్యామిలీ లాయర్‌

రియాద్:జర్నలిస్ట్‌ జమాల్‌ ఖష్షోగి హత్య కేసులో సౌదీ అరేబియన్‌ కోర్ట్‌ తీర్పుని, బాధిత కుటుంబం స్వాగతిస్తున్నట్లు ఆ కుటుంబం తరఫు లాయర్‌ మొతెసామ్ ఖష్షోగి చెప్పారు. 2018లో జమాల్‌ ఖష్షోగి హత్య జరిగిన విషయం విదితమే. అతి కిరాతకంగా జమాల్‌ ఖష్షోగిని హత్య చేశారు నిందితులు. నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష ఖరారు చేయగా, జమాల్‌ ఖష్షోగి కుటుంబం దోషులకు క్షమాభిక్ష పెట్టింది. దాంతో, మరణ శిక్ష కాస్తా జైలు శిక్షగా మారింది. నిందితుల్లో ఎనిమిది మందికి 7 నుంచి 20 ఏళ్ళ వరకు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఘోరమైన హత్య జరిగిందనీ, ఈ ఘటనకు సంబంధించి దోషులపై శిక్షకు సంబంధించి భారమంతా దేవుడిపైనే వేశామనీ, తమకు న్యాయం చేసేలా సౌదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నమ్మామనీ, అదే ఈ రోజు జరిగిందనీ జమాల్‌ ఖష్షోగి కుటుంబం అభిప్రాయపడినట్లు లాయర్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com