వాహనాల స్వాధీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన అబుధాబి పోలీసులు
- September 10, 2020
అబుధాబి:నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసే వారి వాహనాల స్వాధీనానికి సంబంధించి అబుధాబి పోలీసులు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేశారు. కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఎవరైన వాహనదారుడు పోలీసుల వాహనాలను ఢీకొన్నా..పోలీస్ వాహనాల డ్యామేజ్ కి కారణమైనా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు డ్రైవర్ కి 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా రేసింగ్ లలో పాల్గొన్నా, సరైన నెంబర్ ప్లేట్ లేకున్నా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైనా, రోడ్ క్రాసింగ్ కు నిర్దేశించిన ప్రాంతాల్లో పాదాచారులకు దారి ఇవ్వకున్నా డ్రైవర్ కు 5,000 దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను ముందు సీటులో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేసినా 5,000 దిర్హామ్ ల ఫైన్ విధిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..