బహ్రెయిన్: చెప్పా పెట్టకుండా పని మానేస్తా ఫ్లెక్సీ పర్మిట్ కు అవకాశమే లేదు
- September 11, 2020
మనామా:చెప్పాపెట్టకుండా పని మానేసే(పారిపోయిన) కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లెక్సీ పర్మిట్ ఇచ్చే అవకాశమే లేదని బహ్రెయిన్ కార్మిక నియంత్రణ అధికార విభాగం తేల్చి చెప్పేసింది. అంతేకాదు..అలాంటి కార్మికులు వేరే చోట పని చేసేందుకు కూడా అవకాశం ఉండదని స్పష్టం చేసింది. కొత్త యాజమాని దగ్గర పని కుదిరేందుకు అవసరమైన ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వబోమని ప్రకటించింది. అంటే..ఒకవేళ ప్రవాస కార్మికుడు యజమాని అనుమతి లేకుండా పని మానేస్తే వారికి మరో ఉపాధి అవకాశం లేకుండా పోతుంది. ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి తప్ప మరో మార్గం ఉండదు. ప్రస్తుతం కింగ్డమ్ పరిధిలో చెప్పాపెట్టకుండా పని మానేసిన(పారిపోయిన) కార్మికుల సంఖ్య మొత్తం ప్రవాస కార్మికుల సంఖ్యలో 0.4 శాతం లోపే ఉందని కూడా ఎల్ఎమ్ఆర్ఏ వెల్లడించింది. ఒక వేళ ఎవరైన కార్మికుడు ఎలాంటి సమాచారం లేకుండా 15 రోజులు అంతకుమించి విధులకు హజరుకాకుంటే..ఆ విషయాన్ని అధికారులకు నివేదించాలని ఎల్ఎమ్ఆర్ఏ యజమానులకు సూచించింది. యజమాని రిపోర్ట్ ను ఎల్ఎమ్ఆర్ఏ నిర్ధారించుకున్న తర్వాత ఇక సదరు కార్మికుడు ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ చేసుకోవటానికిగానీ, అదే యజమాని దగ్గర మళ్లీ చేసుకునేందుకు అనుమతి కోరుతూ రిక్వెస్ట్ చేసుకునేందుకు పూర్తిగా అనర్హుడు అవుతాడు. దీంతో ఆ కార్మికుడికి ఫ్లెక్సీ పర్మిట్ అవకాశం లేకుండా పోతుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







