కంపెనీలకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం మార్పులు వర్తింపు

- September 16, 2020 , by Maagulf
కంపెనీలకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం మార్పులు వర్తింపు

మస్కట్‌:ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయబడిన ప్రొవిజన్స్‌ కేవలం కంపెనీలకు సంబంధించినవి మాత్రమేనని అధికారులు వెల్లడించారు. సుల్తాన్‌ హైతం బిన్‌ టారిక్‌ జారీ చేసిన రాయల్‌ డిక్రీ సెప్టెంబర్‌ 14న విడుదలైన విషయం విదితమే. ఈ డిక్రీపై మినిస్ట్రీ అధికారులు స్పష్టతనిచ్చారు. కంపెనీల లాభాలపై టాక్స్‌కి సంబంధించి ఈ చట్టంలో మార్పులు జరిగాయనీ, ఇండివిడ్యువల్స్‌కి ఈ మార్పులతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూషన్‌, ఫెసిలిటీ లేదా ఒమనీ కంఎనీ లేదా స్టేబుల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి సంబంధించి రెగ్యులేషన్స్‌ ఇందులో పేర్కొనబడినట్లు అధికారులు వివరించారు. ఆయా ఫెసిలిటీస్‌, సుల్తానేట్‌లో కమర్షియల్‌ రిజిస్ట్రీ కలిగి వుంటే, టాక్స్‌ చట్టం పరిధిలోకి వస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com