కువైట్ లో కొత్తగా మరో 698 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
- September 16, 2020కువైట్ సిటీ:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా కరోనా తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. కువైట్ లో 24 గంటల్లో కొత్తగా మరో 698 మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించిన బులెటిన్ లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు 96, 999 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో మరో ముగ్గురు మరణించటంతో మృతుల సంఖ్య 571కి చేరింది. అయితే..కరోనా పాజిటివ్ కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో మరో 968 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 87,187కి పెరిగింది. ప్రస్తుతం 9,241 మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..