సౌదీ:ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని GACA సూచన
- September 17, 2020రియాద్:ఇతర దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే ప్రయాణికులు, అదేవిధంగా సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఖచ్చితంగా కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాలని పౌర విమానయాన సాధారణ విభాగం అధికారులు వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం నుంచి సౌదీలకు, ప్రవాసీయులకు మినహాయింపు ఇవ్వాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కింగ్డమ్ లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన మరుసటి రోజునే ప్రయాణికులకు జీఏసీఏ పలు సూచనలు చేసింది. కింగ్డమ్ లోకి ఎంటరైన ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మూడు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపింది. సౌదీ చేరుకున్న 48 గంటల తర్వాత మరోసారి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా తాము కోవిడ్ బారిన పడలేదని నిరూపించుకోవాలి. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని, ప్రభుత్వ సూచనల విధిగా పాటించాలని అధికారులు కోరారు. అదేసమయంలో సౌదీ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు ఆయా దేశాలు ప్రకటించిన మార్గనిర్దేశకాల మేరకు అనుసరించాలని అన్నారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!