త్రీడీ ప్రింట్ ద్వారా దుబాయ్ మెట్రో విడి పరికరాలు ఆవిష్కరించిన ఆర్టీఏ
- September 19, 2020
దుబాయ్: అసలే కరోనా క్లిష్ట పరిస్థితులు. ఈ సమయంలో పారిశ్రామిక ఉత్పత్తుల సామర్ధ్యం అతంత మాత్రంగానే ఉంటోంది. ఒకవేళ ఉత్పత్తి ఉన్నా..వాటి తయారీ ఖరీదు గతంలో కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే..ఈ అవరోధాలన్నింటికి సమాధానంగా దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుంచుకుంటోంది. ఏకంగా దుబాయ్ మెట్రోకు కావాల్సిన విడి బాగాలను త్రీడీ ప్రింట్ ద్వారా రూపొందిస్తూ మెట్రో సమస్యకు పరిష్కారం చూపించింది. అంతేకాదు గతంలో విడిభాగాలు తయారు చేసిన సమయంతో పోలిస్తే త్రీడీ ప్రింట్ ద్వారా 90 శాతం సమయాన్ని ఆదా చేస్తోంది. దుబాయ్ మెట్రో నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థ సెర్కొతో కలిసి విడి భాగాల తయారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీఏ అనుసరిస్తున్న త్రీడీ ప్రింట్ టెక్నాలజీకి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ను తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన