త్రీడీ ప్రింట్ ద్వారా దుబాయ్ మెట్రో విడి పరికరాలు ఆవిష్కరించిన ఆర్టీఏ
- September 19, 2020
దుబాయ్: అసలే కరోనా క్లిష్ట పరిస్థితులు. ఈ సమయంలో పారిశ్రామిక ఉత్పత్తుల సామర్ధ్యం అతంత మాత్రంగానే ఉంటోంది. ఒకవేళ ఉత్పత్తి ఉన్నా..వాటి తయారీ ఖరీదు గతంలో కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే..ఈ అవరోధాలన్నింటికి సమాధానంగా దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుంచుకుంటోంది. ఏకంగా దుబాయ్ మెట్రోకు కావాల్సిన విడి బాగాలను త్రీడీ ప్రింట్ ద్వారా రూపొందిస్తూ మెట్రో సమస్యకు పరిష్కారం చూపించింది. అంతేకాదు గతంలో విడిభాగాలు తయారు చేసిన సమయంతో పోలిస్తే త్రీడీ ప్రింట్ ద్వారా 90 శాతం సమయాన్ని ఆదా చేస్తోంది. దుబాయ్ మెట్రో నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థ సెర్కొతో కలిసి విడి భాగాల తయారీ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీఏ అనుసరిస్తున్న త్రీడీ ప్రింట్ టెక్నాలజీకి సంబంధించి చిన్న వీడియో క్లిప్ ను తమ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







