త్వరలో వెబ్ సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న రేణూ దేశాయ్
- September 20, 2020
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ సినిమాలకు దూరమై చాలా ఏళ్లవుతోంది. ఆమె రీఎంట్రీపై ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. అయితే, తన రీఎంట్రీపై స్వయంగా ఆమే స్పందించింది. త్వరలో ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. కృష్ణమామిడాల డైరెక్షన్ వస్తున్న ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుందని తెలిపారు. డీఎస్.రావు, ఎస్.రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ‘చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. ఓ అందమైన వెబ్ సిరీస్లో నటించేందుకు సంతకం చేశానని ప్రకటిస్తున్నందుకు ఎక్జైయిటింగ్గా ఉంది. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుంది.
త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు చెప్తాను. సత్యాన్వేషణలో ఉన్న ఓ మహిళ ప్రయాణానికి మీ ఆశీస్సులు, ప్రేమను అందించాలని కోరుకుంటున్నా’అని రేణూ ఇన్స్టా పోస్టులో వెల్లడించారు. కాగా, తన కుమారుడు అకీరా నందన్ సినీరంగ ప్రవేశంపై కూడా ఆమె ఇటీవల క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. రేణూ ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్నారు. ఇదిలాఉండగా.. మహేష్బాబు సినిమాలో రేణుదేశాయ్ నటించబోతున్నారన్న వార్తలపై ఆమె క్లారిటీ ఇటీవల ఇచ్చారు. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







