హోటల్ బిజినెస్లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేతలు..
- September 21, 2020
హైదరాబాద్:హోటల్ బిజినెస్లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేతలు.. దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా గ్రాండ్గా ప్రారంభమైన "1980స్ మిలటరీ హోటల్" (1980's Military Hotel)
నాగచైతన్య, సమంత జంటగా 'మజిలీ' వంటి బ్లాక్బస్టర్ మూవీని నిర్మించి, ప్రస్తుతం నాని హీరోగా 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మిస్తోన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది హోటల్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. పాపులర్ డైరెక్టర్ సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి హైదరాబాద్లో "1980స్ మిలటరీ హోటల్" (1980's Military Hotel)ను స్టార్ట్ చేశారు.
ఖాజగూడ-నానక్రామ్ గూడ రోడ్డులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ హోటల్ను సోమవారం ఉదయం టాలెంటెడ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ పేరు వింటేనే నోరు ఊరుతోందని, తప్పకుండా ఈ హోటల్కు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
సంప్రదాయబద్ధమైన, నోరూరించే తెలుగింటి రుచులతో, అత్యంత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తమ హోటల్లో అందిస్తామని "1980స్ మిలటరీ హోటల్" యజమానులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







