హోటల్ బిజినెస్లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేతలు..
- September 21, 2020
హైదరాబాద్:హోటల్ బిజినెస్లో అడుగు పెట్టిన షైన్ స్క్రీన్స్ అధినేతలు.. దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా గ్రాండ్గా ప్రారంభమైన "1980స్ మిలటరీ హోటల్" (1980's Military Hotel)
నాగచైతన్య, సమంత జంటగా 'మజిలీ' వంటి బ్లాక్బస్టర్ మూవీని నిర్మించి, ప్రస్తుతం నాని హీరోగా 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మిస్తోన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది హోటల్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. పాపులర్ డైరెక్టర్ సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి హైదరాబాద్లో "1980స్ మిలటరీ హోటల్" (1980's Military Hotel)ను స్టార్ట్ చేశారు.
ఖాజగూడ-నానక్రామ్ గూడ రోడ్డులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన ఈ హోటల్ను సోమవారం ఉదయం టాలెంటెడ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ చేతుల మీదుగా ప్రారంభించారు. హోటల్ పేరు వింటేనే నోరు ఊరుతోందని, తప్పకుండా ఈ హోటల్కు మంచి పేరు వస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.
సంప్రదాయబద్ధమైన, నోరూరించే తెలుగింటి రుచులతో, అత్యంత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తమ హోటల్లో అందిస్తామని "1980స్ మిలటరీ హోటల్" యజమానులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!









