జాతీయ విద్యా విధానంతో భారత్ కు విశ్వగురువు స్థానం:తెలంగాణ గవర్నర్
- September 21, 2020హైదరాబాద్:నేషనల్ ఎడ్యుకేషన్ పాలసి-2020 సమర్ధవంతమైన అమలుతో భారత్ విశ్వగురువుగా అవతరిస్తుందని గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
భారతీయ మూలాల ఆధారంగా ఆధునిక ప్రపంచ అవసరాలకనుగుణంగా రూపొందిన ఈ జాతీయ విద్యా విధానంతో విద్యారంగంలో భారత్ అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పుతుందన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.
విద్యాభారతి సంస్థ ఈ నూతన విద్యా విధానంపై విద్యార్థులలో అవగాహన పెంచడానికి, వారిని చైతన్యవంతం చేయడానికి ‘మై ఎన్ ఈ పి’ అనే కార్యక్రమం ద్వారా పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని గవర్నర్ సోమవారం రోజు ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ విద్యావిధాన రూపకర్తలైన ప్రముఖ సైంటిస్ట్ డా. కస్తూరి రంగన్ ఇతర సభ్యులు విద్యారంగంలో భారత్ కు ప్రాచీన కాలం నుండి ఉన్న గొప్ప పేరును, వైభవాన్ని తిరిగి సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఎన్ ఈ పి – 2020 ప్రవేశపెట్టారని డా. తమిళిసై వివరించారు.
విద్యారంగంలో మౌళికమైన, సమూల మార్పుల ద్వారా ఆధునిక సాంకేతిక యుగానికి సంబంధించి వివిధ రంగాలలో భవిష్యత్ నాయకులను తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడుతుందన్నారు.
వివిధ రంగాల సమ్మిళిత పరిశోధనా పద్ధతులు, వృత్తి విద్య, ప్రాక్టికల్ విద్యావిధానం, ఆవిష్కరణల ప్రోత్సాహం, ప్రపంచస్థాయి ఆధునిక విద్యా పద్ధతులు ఈ జాతీయ విద్యావిధానంలో ఉండటం ఆహ్వానించతగ్గ అంశాలన్నారు.
భారత్ ను విజ్ఞాన-ఆధారిత ఆర్ధిక వ్యవస్థగా మార్చడం, నాలెడ్జ్ సూపర్ పవర్ గా తీర్చిదిద్ధడం అన్న స్పష్టమైన లక్ష్యాలతో వచ్చిన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని సమర్ధవంతమైన అమలు కోసం అందరూ భాగస్వాములు కావాలని డా.తమిళిసై పిలుపునిచ్చారు.
ఈ జాతీయ విద్యా విధానం – 2020 పై విస్తృత అవగాహన విద్యార్ధులలో కల్పించడానికి ‘మై ఎన్ ఈ పి’ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యాభారతి కృషిని గవర్నర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణ మద్య అధ్యక్షుడు సిహెచ్. ఉమామహేశ్వరరావు,శ్రీ సరస్వతి విద్యా పీఠం అధ్యక్షుడు ప్రొ.టి.తిరుపతిరావు, కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటి సెక్రటరీ అన్నదానం సుబ్రమణియం,ఎన్ సి ఈ ఆర్టీ మెంబర్ పి. మురళి మనోహర్, విద్యాభారతి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్.సుధాకర్ రెడ్డి, విద్వత్ పరిషత్ అధ్యక్షులు ఆవుల మంజులత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన