820 వాహనాలను స్వాధీనం చేసుకున్న రాస్ ఆల్ ఖైమా పోలీసులు
- September 27, 2020రాస్ ఆల్ ఖైమా:రోడ్ల పక్కన, గ్యారేజ్ లు, ఇతర ప్రాంతాల్లో చాలా కాలంగా వదలేసిన వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మే నుంచి మొత్తం 820 వాహనాలను జప్తు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిర్వహణ లేకుండా వదిలేసిన వాహనాలు దుమ్ము, ధూళితో అధ్వాన్నంగా మారి సిటీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాంటి వాహనాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించిన పోలీసులు..ఇప్పటికే ఆయా వాహనాల ఒనర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. పది రోజుల్లో వాహనాలను అక్కడి నుంచి తీసేయాలని గడువు ఇచ్చారు. నిర్దేశించిన గడువులోగా తీసుకుపోని వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అమ్మకానికి పెట్టనున్నారు. ఇక నెంబర్ ప్లేట్లు లేకుండా వదిలేసిన వాహనాల విషయంలో నోటీసులు కూడా ఇవ్వబోమని..ఆ మరుక్షణమే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే పాడైపోయిన వాహనాలు, దుమ్ము పట్టి అధ్వాన్నంగా ఉన్న వాహనాలు, నడవటానికి వీల్లేని వాహనాల విషయంలోనూ నోటీసులు ఇవ్వబోమని...వెంటనే సీజ్ చేస్తామని స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?