పీఎం కేర్స్కు బ్యాంకుల నుంచి రూ.200 కోట్ల విరాళం
- September 28, 2020
న్యూ ఢిల్లీ:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రతీఒక్కరూ నడుంబిగించారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ కు భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున విరాళాలు అందించినట్టు ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో పాటు ఏడు ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కలిసి పీఎం కేర్స్కు రూ. 200 కోట్ల విరాళం ఇచ్చాయి. ఇందులో ఆర్బీఐ రూ. 7.34 కోట్లు ఇవ్వగా, ఎస్బీఐ తమ ఉద్యోగుల జీతాల్లో నుంచి రూ. 107.95 కోట్లు ఇచ్చింది. సీఎస్ఆర్, ఎల్ఐసీ, జీఐసీతో పాటు నేషనల్ హౌసింగ్ బ్యాంకు కలిపి రూ. 144.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. కేంద్ర విద్యా సంస్థలన్ని కలిసి రూ. 204.75 కోట్లు విరాళంగా ఇచ్చాయి.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!