105 ఇండియన్ పోర్ట్ వర్కర్స్కి దక్కని వేతనాలు
- October 03, 2020
కువైట్ సిటీ: 105 మంది ఇండియన్ వర్కర్స్ (అందులో 99 మంది తమిళనాడుకు చెందినవారు), జూన్ నుంచి వేతనాలు అందుకోలేకపోతున్నారు. వీరంతా షుయైబా పోర్టులో పనిచేస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో వీరంతా ఇండియన్ ఎంబసీ తమ వేతనాల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. భారత రాయబారి సిబి జార్జి, కార్మికులకు అవసరమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. వేతనాలు అందకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, ఇంటి అద్దె చెల్లించలేక.. పూట గడవడం కూడా కష్టమవుతోందని కార్మికులు వాపోతున్నారు. అక్టోబర్ - డిసెంబర్ మధ్య తమ రెసిడెన్స్ గడువు తీరే అవకాశం వుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేకపోవడంతో ల్యాండ్ లార్డుల నుంచి సమస్యల వస్తాయని ఆవేదన చెందుతున్నారు బాధిత కార్మికులు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







