కరోనా కాలంలో కంపెనీ లాభాలు.. ఉద్యోగులకు కార్లు గిప్ట్
- October 07, 2020
కరోనా వైరస్ వచ్చి చాలా కంపెనీలను మూత పడేలా చేసింది. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ పరిస్తితుల్లో ఓ కంపెనీ లాభాల బాట పట్టిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకు ప్రతిగా ఉద్యోగులకు కంపెనీ కార్లు బహుకరించి ఉద్యోగుల పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను తెలియజేసింది. అది కూడా కరోనా వైరస్ను ప్రపంచం మీదకు వదిలినట్టుగా చెప్పుకుంటున్న చైనాలో జరిగింది. జియాంగ్జీ వెస్ట్ దజియై ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ తమ ఉద్యోగులకు 4,116 కార్లను బహుమతిగా ఇచ్చింది.
ఈనెల 1న ఈ కార్యక్రమాన్ని భాతీగా నిర్వహించింది. వరుసగా ఐదో ఏడాది కూడా కంపెనీ లాభాల బాట పట్టిందన్న సంతోషంతో యాజమాన్యం తమ సిబ్బందికి మరిచిపోలేని గిప్ట్ని అందించి ఉద్యోగుల పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకుంది. అయితే అవేవో సాదా సీదా కార్లు కాదు.. కాస్లీ కార్లు.. ఈ మొత్తం కార్లు కొనుగోలు చేయడానికి కంపెనీ ఖర్చు పెట్టి అక్షరాల రూ.540 కోట్లు. 1,183 ఖరీదైన FAW వోక్స్వ్యాగన్ మాగోటన్ కార్లు, 2,933 జియాంగ్లింగ్ ఫోర్డ్ టెరిటరీ కార్లను అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!