కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ఫోటోలు,పేర్లు వెల్లడిస్తామని హెచ్చరించిన ఒమన్

- October 11, 2020 , by Maagulf
కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ఫోటోలు,పేర్లు వెల్లడిస్తామని హెచ్చరించిన ఒమన్

మస్కట్:ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ప్రజల్లో అప్రమత్తత లేకపోవటంతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావటం లేదు. కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మృతుల్లో అన్ని వయసుల వారు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఒమన్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక నుంచి కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించిన వారి పట్ల నేమ్ అండ్ షేమ్ విధానాన్ని అనుసరించాలని డిసైడ్ అయ్యింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ ప్రకటించిన మార్గనిర్దేశకాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారి పేర్లను, ఫోటోలను మీడియా ద్వారా వెల్లడిస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా యువకులు మరింత అప్రమత్తంగా ఉండాలని, దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం యువత నిబంధనలు పాటిస్తూనే కుటుంబ సభ్యుల్లో కూడా అవగాహన పెంచాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సమూహ కార్యక్రమాలు నిర్వహించొద్దని, చివరికి కుటుంబ బంధువులు కూడా గుమికూడి నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సుప్రీం కమిటీ తెలిపింది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com